ధారూరు, ఫిబ్రవరి 10: వచ్చే సోమవారం నుంచి వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ధరణిప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు. అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయా ల్లో ఈ నెల 13 నుంచి ధరణి సమస్యల పరిష్కారానికి ధరణి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని.. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు పాల్గొని ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు.
ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోని తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి ధరణి ప్రజావాణి కార్యక్రమంపై తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ శనివారం ఉదయం 9:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దారందరూ ధరణి ఆపరేటర్లతో కలిసి కలెక్టరేట్కు చేరుకోవాలన్నారు. ఒక్కొక్క తహసీల్దార్ కార్యాలయం నుంచి వంద కేసుల పరిష్కారానికి కృషి చేయ డం జరుగుతుందన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి క్లియర్గా ఉన్న కేసులనే తీసుకు రావాలని సూచించారు. ముఖ్యంగా కోర్టు కేసు లు లేనివి, ఈసీ క్లియర్గా ఉండి పట్టాదారు కబ్జాలో ఉండాలన్నారు. ఇలాంటి సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రజలు సంతోషపడతారన్నారు.
ఎన్నికల కోడ్ను అమలుపర్చాలి
శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని.. అందువల్ల ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎన్నికల కోడ్ అమలుపై అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, రెవెన్యూ అధికారి అశోక్కుమార్, ఆర్డీవో, తహసీల్దార్లు, ఎంపీడీవో లు, ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్ల ను వెంటనే తొలగించాలన్నారు.
కార్యాలయా ల్లో ఉన్న ప్రజాప్రతినిధుల ఫొటోలను తొలగిం చి, స్టోర్ రూముల్లో భద్రపర్చాలన్నారు. గోడలపై ఉన్న వాల్ పెయింటింగ్, పోస్టర్లను కూడా తొలగించాలని.. అనుమతి లేకుండా ప్రైవేట్ వాహనాలపై ఫొటోలు పెట్టుకోరాదన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని ఆయా శాఖల కార్యాలయాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కార్యాలయాలను సొంత ఇంటిలా శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజూమరుగుదొడ్లను శు భ్రం చేసేందుకు స్కావెంజర్లను ఏర్పాటు చేసు కోవాలన్నారు. కార్యాలయాల్లోని పాత ఫర్ని చర్ కు ఉన్న స్టిక్కర్లను తొలగించి రంగులు వేయిం చాలని అధికారులను ఆదేశించారు. విధులకు గైర్హాజరైన అధికారులపై ఆయన ఆరా తీశారు.