పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 20: మున్సిపాలిటీలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని పెద్దఅంబర్పేట, పసుమాముల, కుంట్లూరు, తట్టిఅన్నారంలో బుధవారం రూ.12.64 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. త్వరలోనే మరో రూ.10 కోట్లతో మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. రూ.6.5 కోట్లతో పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు.
ముందుగా బుధవారం ఉదయం పెద్దఅంబర్పేట నుంచి కొహెడ మార్గంలోని చాకర వాగు, చెన్నవాగుపై రూ.5.45 కోట్ల నిధులతో కొనసాగుతున్న హైలెవల్ వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వంతెన పనుల విస్తరణ కోసం తాజాగా మరో రూ.3 కోట్లు మంజూరు కానున్నాయని, ఆ పనులు కూడా త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతాయని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. పసుమాముల నుంచి పెద్దఅంబర్పేట వరకు రూ.4.5 కోట్లతో చేపడుతున్న బీటీ డబుల్ రోడ్డు పనులకు కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీలోకి రూ.1.38 కోట్ల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు, కుంట్లూరులో రూ.1.31 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్డు, వరద కాల్వ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కమిషనర్ ఎస్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్లు సిద్దెంకి కృష్ణారెడ్డి, విద్యారెడ్డి, రోహిణిరెడ్డి, అర్చన, అనుపమరెడ్డి, గీత, అనురాధ, మణెమ్మ, చల్లూరి మురళీధర్రెడ్డి, దండెం కృష్ణారెడ్డి, శ్రీధర్రెడ్డి, హరిశంకర్, పరశురాం, కోటేశ్వర్రావు, బ్యాంకు డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఈదమ్మల బలరాం, వెంకటేశ్వర్రెడ్డి, భాస్కర్, ప్రవీణ్కుమార్ ప్రభాకర్రెడ్డి, విజయ్భాస్కర్రెడ్డి, దామోదర్ పాల్గొన్నారు.
యాచారం : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, కోళ్లఫారాల బాధితులకు నష్టపరిహారం చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బుధవారం పంపిణీ చేశారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన 493 మంది బాధితులకు రూ.41,70,400, కేసీతండాకు చెందిన 128మంది బాధితులకు 11,41,100 మొత్తం 621 మందికి రూ.53,11,500 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా ఎవరైనా పరిహారం అందని బాధితులు ఉంటే వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మంథన్గౌరెల్లిలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, వైస్ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్నాయక్, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ జ్యోతి, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఉప తహసీల్దార్ ప్రవీణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, రాజు, ఖాజు, కల్లూరి శివ, కిషన్నాయక్, యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.