షాద్నగర్/నందిగామ,మే 30 : బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పనులు వేగంగా సాగుతున్నాయి. నగరాలకు దీటుగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.160.33 కోట్లతో అభివృద్ధి పనులు పురుడుపోసుకున్నాయి. మంగళవా రం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ , ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు నందిగామ బైపాస్ రోడ్డులో ప్రారంభమైన పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు షాద్నగర్ పట్టణంలో ముగిసింది. నందిగామ బైపాస్ రోడ్డులో రూ.2 కోట్లతో నిర్మించి విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం షాద్నగర్ బైపాస్ రోడ్డులో షాద్నగర్ నుంచి కేశంపేట రోడ్డు వరకు రూ.15 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనుల ను ప్రారంభించారు. అనంతరం షాద్నగర్ పట్టణంలోని పాల కేంద్రం వద్ద రూ. 45 కోట్లతో చేపడుతున్న పాత జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి కేశంపేట రోడ్డులో రూ.1.88 కోట్లతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కొత్తపేట రోడ్డులో రూ.95 కోట్లతో నిర్మిస్తున్న చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రూ.45 లక్షలతో నిర్మించిన నైట్షెల్టర్ భవనాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా మండల పరిషత్ ఆవరణలో రూ.కోటి నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు మంత్రి బృందానికి కేశంపేట బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బైపాస్ మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం మండల పరిషత్ ఆవరణలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీలు ఖాజాఇద్రీస్, రవీందర్యాదవ్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, లతశ్రీ, విశాల, స్వరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ కవితానారాయణ, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, నారాయణరెడ్డి, విశ్వం, శ్యాం సుందర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీశై లం, సూర్యప్రకాశ్, దేవేందర్యాదవ్, నర్సింగరావు, దామోదర్రెడ్డి, బక్కన్నయాదవ్, లక్ష్మణ్నాయక్, శ్రీధర్రెడ్డి, రాజూనాయక్, ఆనంద్నాయక్, గణేశ్, జమృత్ఖాన్, యుగేందర్, శ్రీనివాస్గౌడ్, ఎజాజ్, సర్వర్పాషా, సలీం, సిరాజుద్ధీన్, రవియాదవ్, యాదగిరియాదవ్, రాఘ వేందర్రెడ్డి, రఘుమారెడ్డి, వెంకట్రాంరెడ్డి, నర్సింహ, శంకర్, నరేశ్, శ్రీనివాసులు, శ్రీశైలంగౌడ్, కృష్ణవేణి, రాజ్యలక్ష్మి, ఉమాదేవి, మురళీధర్రెడ్డి, వేణుగోపా ల్, రాము, భూపాల్రెడ్డి, యా దయ్య, సుధాకర్, గోపాల్, మహేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.