షాద్నగర్టౌన్, మార్చి 02 : 0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం వైద్య సిబ్బందితో కలిసి ఫరూఖ్నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 0-5 సంవత్సరాల పిల్లలు 34,156 మంది ఉన్నారని తెలిపారు. చుక్కలను వేసేందుకు తాలూకా స్థాయిలో 292 బూత్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
29 రూట్లలో వాహనాలను తిరుగుతాయని, పల్స్ పోలియో కార్యక్రమంలో 426 టీంలు పాల్గొంటాయని తెలిపారు. మొత్తం 1252 మంది ఆరోగ్య సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో విధులు నిర్వహించనున్నారని, 10 ట్రాన్సిస్టర్ పాయింట్లు, 7మొబైల్ వాహనాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మొదటి రోజు డివిజన్లో ఏర్పాటు చేసిన బూత్ల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పల్స్ పోలియో చుక్కలను వేయనున్నట్లు పేర్కొన్నారు.మొదటి రోజు తరువాత రెండు, మూడో రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : డివిజన్లో నేటి నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ధరణికుమార్ అన్నారు. పోలియో చుక్కల కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలు 63,204మంది ఉన్నారని తెలిపారు. డివిజన్లో మొ త్తం 286 బూత్లు ఏర్పాటు చేశామని, 1144 మంది పల్స్పోలియో చుక్కలు వేయటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు, ఫిబ్రవరి 2: అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏండ్ల వయసున్న చిన్నారులందరికీ ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఉంటుందని మండల వైద్యాధికారి హరికిషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తూరు చౌరస్తాలోని ఎస్బీఐ ఎదుట ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు. ఇంతకు ముందు వేయించిన వారు తిరిగి వేయించాలని సూచించారు. బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చినా, ఇతర గ్రామాలకు చెందిన వారు కూడా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవచ్చని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పకుండా చుక్కల ముందు వేయించి అంగవైకల్యం నుంచి కాపాడాలని సూచించారు.