కందుకూరు, మే 25 : రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని రాచులూరు గేటు సమీపంలో గల పెద్దమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న గుమ్మడ వెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రాచులూరు పశువైద్యాధికారి షాహిన్ షేక్, సమాచారం అందజేసి పోస్టుమార్టం నిర్వహించి ఫారెస్ట్ ఆఫీసర్కు అప్పగించారు.
అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి గుమ్మడవెల్లి ఫారెస్ట్ భూమిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల వెంట వెళ్లే వాహనాలు ఫారెస్ట్ లో ఉన్నచోట నిదానంగా వెళ్లాలని సూచించారు. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నట్లయితే వాటిని పరిశీలించి వాహనాన్ని గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు.