మంచాల, మార్చి 28 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవా లని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ఆరుట్ల గ్రామంలో సీఆర్పీఎఫ్ బలగాలతో వీధుల్లో ప్లాగ్మార్చ్ నిర్వహించారు. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
అనంతరం డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయా లన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీరాజ్, మంచాల సీఐ బాబ్యానాయక్, ఎస్ఐ రవినాయక్, ఏఎస్ఐ సతీశ్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.