శంషాబాద్ రూరల్, డిసెంబర్ 4: ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకా రం.. షాద్నగర్ డివిజన్ ఫరూఖ్నగర్ మండలంలోని కడియాలకుంట తండాకు చెందిన పాత్యావత్ గోపాల్(47), అతడి భార్య అంజలి (42), కూతురు స్వాతి(12) కలిసి మధ్యాహ్నం షాద్నగర్ వైపు నుంచి నగరంలోని చంపాపేటకు బైక్పై బయలుదేరారు. వీరి కూతురు చంపాపేటలోని ఓ హాస్టల్లో ఉంటుంది.
బైక్పై పెద్దషాపూర్ మీదుగా వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. గోపాల్, అంజలి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక అబ్బాయి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.