ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టులో పర్యాటకులు సెల్పీలు దిగుతు, బోటింగ్ చేసేందుకు ఆధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రాజెక్టుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి తమతమ గమ్యలకు వెళ్లిపోయారు.