కొడంగల్, మే 17: ‘దళితబంధు’ పథకం దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో దౌల్తాబాద్ మండల దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. అదేవిధంగా కొడం గల్ మండలంలోని 148 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 35మంది షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.కోటి 83లక్షల 21వేల 282 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా వర్గాల వారికి సంక్షేమ పథకాలను అం దిస్తున్నట్లు తెలిపారు.
దళితబంధు పథకంలో మొదటి దఫాగా నియోజక వర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం దౌల్తా బాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్తో పాటు ఒక కారును అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. కార్య క్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్లు వెంకట్రెడ్డి, సావిత్రమ్మసాయిలు, గోవింద్, సయ్యద్ అంజద్, గుండప్పతో పాటు రెవెన్యూ అధికారులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను అందు కోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండ లంలోని పెద్దనందిగామ గ్రామంలో మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్ర మంలో భాగంగా గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం లోపించిందని స్పెషల్ డ్రైవ్ నిర్వ హించాలని ఎంపీడీవో శ్రీనివాస్ను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఏయే పనులు చేపడు తున్నారు, ఎంత వరకు కూలీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారనే అంశంపై ఏపీవో రాములు తో వివరాలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసా యా ధికారి ఏవో బాలాజీ ప్రసాద్తో గ్రామంలో రైతు బీమా, రైతు బంధు తది తర వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో మురుగు కాలువల శుభ్రం, విద్యుత్ తీగల మరమ్మతుల వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసరా పెన్షన్ కోసం లబ్ధిదారులకు సహకరించాలని అధికారులకు సూచిం చారు. అనంతరం హస్నాబాద్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్ద ప్ప దేశ్ముఖ్, హస్నాబాద్, పెద్దనందిగామ సర్పంచ్లు పకీరప్ప, శారదమ్మ, మాజీ సర్పంచ్ సంజీవ్రెడ్డి, మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, విద్యుత్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మిషన్ భగీరథ డీఈ, ఏఈలతో పాటు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దామోదర్రెడ్డి, మాజీ అధ్యక్షులు గోడల రాంరెడ్డి, టీటీ రాములు, సిద్ధిలింగప్ప పాల్గొన్నారు.