శంషాబాద్ రూరల్, డిసెంబర్ 28 : లోదుస్తుల్లో బంగారం దాచుకొని తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా అతడి షర్ట్, ప్యాంటులో పేస్టు రూపంలో దాచుకొని తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన బంగారం 704 గ్రాములు, మొత్తం విలువ 39.66 లక్షలు ఉంటుందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.