హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : చేనేతపై అమలు చేస్తున్న జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించాలని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు.
ఇప్పటికీ అధికశాతం చేనేత కళాకారుల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగానే ఉన్నదని వాపోయారు. సంప్రదాయ చేనేతపై కూడా యాంత్రిక వస్త్ర పరిశ్రమతో సమానంగా జీఎస్టీ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.