న్యూఢిల్లీ : దేశ రాజధానిని ఆక్సిజన్ కొరత వెంటాడుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందులను అక్రమంగా నిల్వ చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.
నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వీరినుంచి 115 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, రెండు కార్లు, రూ 4.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైన్యం సాయాన్ని కోరుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.