కులకచర్ల : తాళం వేసిన ఇంట్లో తులంనర బంగారు ఆభరణాలు దొంగతనానికి గురైన సంఘటన కులకచర్ల మండల కేంద్రంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్ల గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 22న కిరాయికీ ఉంటున్న ఇంటికి తాళం వేసి తన సొంత గ్రామమైన తాండూరు వెళ్లి తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా రూముకు తాళం పగుల గొట్టి ఉన్నట్లు గమణించాడని, ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు బీర్వాతాళాలు పగుల గొట్టి రెండు బంగారు గొలుసులు, రెండు జతల మ్యాట్నీలు దొంగిలించినట్లు తెలిపారు. దొంగిలించిన వస్తులు సుమారు తులంనర బంగారం అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ పెంటయ్య తెలిపారు.