శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పర్వేద క్రాస్ రోడ్ వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన బీరప్పగారి చంద్రయ్య(55), తన పొలంలో పండించిన పూలను బైక్పై నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తీసుకెల్లి అమ్ముకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రామంతపురం శివారులోని పర్వే క్రాస్ రోడ్డు వద్ద చేవేళ్ల నుంచి వేగంగా వస్తున్నలారీ నం. కేఏ32డీ3592 ఢీకొట్టడంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. 10ని.లలో ఇంటికి క్షేమంగా చేరుకునే వ్యక్తిని లారీ మృత్యువు రూపంలో కబలించింది. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్గౌడ్ తెలిపారు.