కేశంపేట : కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లి శివార్లలోని పెద్దచెరువులో ఓ యువకుడు పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్ల శ్రీనివాసచారి (26) రెండు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే చెరువులో యువకుడి శవం తేలివుండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయగా గ్రామస్తులు మృతుడు వడ్ల శ్రీనివాసచారిగా గుర్తించారు. ఈ సంఘటనపై మృతుని అన్న మహిపాల్చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.