ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ సైదులు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా దిండి మండలం, జైత్యాతండాకు చెందిన సభావత్ జీవన్ (36) నగరంలోని హస్తినాపురంలో నివాసముంటూ వృత్తిరీత్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి వెల్లిపోయాడు.
జీవన్కు అప్పుల బాధ ఎక్కువగా ఉండటంతో మనస్థాపానికి గురై శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్దగల చర్చి దగ్గర ఆటోలో పురగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.