కొత్తూరు : గుర్తుతెలియని వ్యక్తులు చున్నితో ఉరేసి మహిళను హత్య చేసిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ సబ్స్టేసన్ రోడ్డులోని అమూల్య సామిల్ వద్ద ఓ మహిళ మృతి చెంది ఉందని సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. ఈ మృతదేహం ఫరూఖ్నగర్ మండలంలోని పులిచెర్లకుంటకు చెందిన కొర కమ్లియా(40)గా గుర్తించారు.
అయితే కొర కమ్లియా మెడకు చున్ని బిగించి ఉంది. దీంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళను చున్నితో ఉరేసి చంపినట్లు ఉందని పోలీసులు బావిస్తున్నారు. ఈ మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.