యాచారం : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన యాదయ్య, మంజుల దంపతుల మద్య ఇటీవల కుటుంబ కలహాలు మొదలయ్యాయి.
కుటుంబ కలహాలతో మన స్థాపానికి గురైన మంజుల (35) ఆదివారం ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగింది. పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.