శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం… మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన తొండ అశోక్ (50) 1వ తేదీన గేదెలను మేపడానికి ఇంటి నుంచి మధ్యాహ్నం బయలుదేరాడు. కాగా తన భర్త తొండ అశోక్ ఇంటికి రాలేదని మృతుని భార్య తొండ ఎల్లమ్మ 2వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు చుట్టుపక్కల వెతకగా మూసీ నది శివారులో నీటి కుంటలో మృతుడు అశోక్ శవమై కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.