పరిగి టౌన్ : ఎద్దు పోడవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య(56) పొలంలో దున్నేందుకు దాయాదులకు చెందిన ఎడ్లను తీసుకెళ్లాడు. పొలంలో నాగలి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఎద్దు పొడించింది.
దీంతో వెంకటయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్నగర్లోని ప్రభుత్వ దవాఖానకు కుటుంబ సభ్యులు తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపారు.