షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పటేల్ రోడ్డులోని శారద అనే మహిళకు చెందిన ఇంటి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్కు చెందిన నాగరాజు (36) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని షాద్నగర్ సర్కారు దవాఖానకు తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే స్థానికంగా నివాసం ఉండే ఓ మహిళతో నాగరాజు అక్రమ సంబంధం కొనసాగించేవాడని, ఈ నేపథ్యంలోనే ఆ మహిళ కుటుంబీకులు హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.