మంచాల : ప్లాట్ కొనుగోలు విషయంలో మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం మంచాల ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన గౌని రాజు వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. నగరానికి చెందిన ఓమహిళకు మంచాల మండలం ఆగపల్లి గ్రామంలోని వెంచర్లో ప్లాట్ ఇప్పిస్తానని పది లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే మహిళకు ప్లాట్ ఇప్పించక పోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా మాట దాటవేస్తు తప్పించుకుతిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి మంచాల పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.