దౌల్తాబాద్ : రావల్పల్లి-మద్దూర్ ప్రధాన రోడ్డు మార్గంలో లారీ-బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లొట్టిగుండా తండాకు చెందిన హన్మంతునాయక్, మాణికిబాయి దంపతుల కుమారుడు అనిల్ (21) అదే తండాకు చెందిన గోవింద్నాయక్ కుమారుడు మహేష్ (19) ఇద్దరూ యువకులు ఆదివారం సొంత పని నిమిత్తం బైక్పై మద్దూర్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో దేవర్ఫస్లవాద్ గ్రామ సమీపన ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరూ యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు చూసి చికిత్స నిమిత్తం 108లో మహాబుబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలో అనిల్ మార్గమద్యలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ పోలీసులు తెలిపారు.