ఇబ్రహీంపట్నంరూరల్ : భార్య భర్తల మధ్య గొడవతో ఓ మహిళా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని తుర్కగూడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. తుర్కగూడ గ్రామానికి చెందిన సామల పద్మ(45) భర్త బాల్రెడ్డి మధ్య జరిగిన గొడవతో మన స్థపానికి గురై శుక్రవారం ఉదయం తమ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానకు తరలించారు. మృతురాలి కూతురు అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.