తాండూరు రూరల్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, కరణ్కోట గ్రామానికి చెందిన సుభాశ్(20) అనే యువకుడు మద్యం తాగి ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే జీవితంపై విరక్తి చెంది మద్యం తాగి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు చేసుకున్నాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.