షాద్నగర్టౌన్ : విద్యుత్షాక్తో 24మేకలు మృతి చెందిన సంఘటన షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితుడు గడ్డం ఆంజనేయులు కథనం ప్రకారం.. గ్రామంలోని తన నివాసం సమీపంలోనే మేకల రక్షణ కోసం ఇనుప కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. కంచెలోని మేకలు ఒక్కసారిగా అరుస్తుండటంతో కంచె వద్దకు వచ్చిన ఆంజనేయులు దంపతులు మేకలను కాపాడేందుకు ప్రయత్నించగా ఇనుప కంచెకు విద్యుత్షాక్ వస్తుందని గమనించారు. జీవనాధారమైన మేకలు కండ్ల ముందే విద్యుత్షాక్తో మృతి చెందటంతో కన్నీరుమున్నీరయ్యారు.
కంచెకు సమీపంలోని ఓ విద్యుత్ స్తంభం పక్కకు వరగడంతో విద్యుత్ వైర్లు పక్కనే ఉన్న ఇనుప కంచెపై పడిందని దీంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. సుమారు 2లక్షల విలువ చేసే మేకలు మృతి చెందాయని తెలిపారు. విద్యుత్షాక్తో మేకలను నష్టపోయిన బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.