వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కరోనా టీకా వేయించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో 15నుంచి 18 సంవత్సరాలలోపు ఉన్న వారికి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వోతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ 2007 సంవత్సరం లేదా అంతకు ముందు పుట్టిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పకుండా తీసుకోవాలన్నారు. వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకొని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం డీఎంహెచ్వో తుకారాం, డిప్యూటీ డీఎంహెచ్వో, మెడికల్ ఆపీసర్లకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, జడ్పీటీసీ ముత్తహర్షరీఫ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.