కొడంగల్, నవంబర్ 18 : ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసకారి రేవంత్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తదితరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో బండ ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక జనాభా ఉన్న ముదిరాజ్లను రాజకీయంగా ఎదిగే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ బిడ్డనైన నన్ను పార్లమెంటు నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కేబినెట్ హోదాను కల్పించినట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని పెంచేలా సొసైటీలు, మత్స్యశాఖలతో అధికారాన్ని కట్టబెట్టినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని కోకాపేటలో 5 ఎకరాల్లో ముదిరాజ్ భవన్ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు రూ.3కోట్లతో మహబూబ్గనగర్లో, రూ.2కోట్లతో వనపర్తిలో, రూ.కోటితో కొడంగల్లో, రూ.30లక్షలతో కోస్గిలో ముదిరాజ్ భవన్ నిర్మాణాలకు భూమి పూజలు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట, మెదక్, జహీరాబాద్తోపాటు కొమురవెళ్లి, యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాల్లో ముదిరాజ్ భవన్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. 70 ఏండ్ల కాలం నుంచి ఎవరికీ తెలియని ముదిరాజ్ల ముద్దుబిడ్డ పండుగ సాయన్న విశిష్టతను చాటేలా మహబూబ్గనర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని పెంచినట్లు తెలిపారు.
షాద్నగర్, పరిగి, చేవెళ్ల లాంటి ప్రాంతాల్లో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 300 విగ్రహాలను ఏర్పాటు చేసేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ బిడ్డ పోలీస్ కిష్టప్ప విగ్రహాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన బిడ్డను డాక్టర్ చదివించినట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ బిడ్డలైన కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్, నీలం ముదిరాజ్లను మోసం చేసింది రేవంత్రెడ్డి అని ఆరోపించారు. ముదిరాజ్ బిడ్డకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ను మోసం చేసి మార్కెట్లో అమ్ముకున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ల ఆత్మగౌరవానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజ్ బిడ్డలు అండగా నిలిచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా పట్నం నరేందర్రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
అంతరిస్తున్న కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేసినట్లు మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మత్స్య సహకార సంఘాల ఏర్పాటుతో పాటు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో పాటు ప్రత్యేకంగా వాహనాలను కూడా అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్ల అభివృద్ధిని పట్టించుకోలేదని.. తద్వారా ముదిరాజ్లు అన్నింటా వెనుకబడ్డారని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో కూడా ముదిరాజ్లకు పెద్దపీట వేసే దిశగా సీఎం ప్రత్యేకంగా కృషి చేయనున్నారని.. ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే ముదిరాజ్ల ఆత్మగౌరవం పెంచేలా ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుకున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ముదిరాజ్ బిడ్డలకు ఎక్కువ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట మునుగుతామన్నారు. రేవంత్రెడ్డిది జిమ్మిక్కుల రాజకీయమని.. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటన్నారు. సొంత పార్టీలోనే ఆశించిన వారికి టికెట్లు ఇవ్వకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు సంచులు అందించిన వారికి టికెట్లను అమ్ముకున్నారన్నారు. గతంలో కూడా ఓటుకు నోటు కేసులో ప్రధానంగా ఉన్నాడని అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు ప్రజా సంక్షేమానికి పాటుపడతాడంటే ఏవిధంగా నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు.
ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము రేవంత్కు లేదని.. అందుకే ప్రతిసారి ఏదో ఒక జిమ్మిక్కును ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై, వాహనాలపై దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మూడు సార్లు దాడులకు పాల్పడ్డారన్నారు. కరోనా సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడికి పోయాడని, ప్రాణభయంతో హైదరాబాద్కు పరిమితమైనట్లు గుర్తు చేశారు. రెండు సార్లు కరోనా వచ్చిన సమయంలో ప్రజల మధ్య ఉండి వైద్య సేవలందించినట్లు తెలిపారు. అందుకే ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు కురిపిస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి అవకాశం ఇస్తే.. ఇంతకు రెట్టింపుగా ప్రజా సేవ చేసి ప్రజలకు మరింత చేరువైతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రాజకీయాన్ని
రాజకీయాన్ని కూడా రేవంత్ వ్యాపారంగా మలిచాడని, నమ్ముకున్నవారిని మోసం చేసి కాంగ్రెస్ టికెట్లను ఎక్కువ వేలం పాట పాడిన వారికి అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అలవాటు ఉన్నవాడు కాబట్టి అన్నింటినీ వ్యాపారంగా చేసే గుణం రేవంత్కు ఉందన్నారు. కొడంగల్లో అవకాశం కల్పిస్తే.. కొడంగల్ను కూడా అమ్మడం ఖాయంగా పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మేల్కోని ప్రజా నాయకుడైన పట్నం నరేందర్రెడ్డిని గెలిపించుకుంటే అన్నింటా సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.
కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం కల్పిస్తే ఎటువంటి అభివృద్ధిని చేసిందో చూడటం జరిగిందన్నారు. కర్ణాటకలో ఎన్నికల్లో 5 గ్యారెంటీల హామీ ఇచ్చి అధికారం వచ్చాక నేడు కాంగ్రెస్లో ఏ ఒక్క గ్యారెంటీ అమలు కావడం లేదన్నారు. స్వయంగా కన్నడ ప్రజలే కొడంగల్కు వచ్చి వారి బాధను వెల్లడించుకున్నారని తెలిపారు. ముదిరాజ్ల ఆత్మగౌరవం సీఎం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని.. ముదిరాజ్లు ఒక్కతాటిపై నిలిచి పట్నం నరేందర్రెడ్డికి మరో అవకాశాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, ఎన్నికల పరిశీలకుడు కిషన్రావు, మున్సిపల్ చైర్మన్ శిరీష, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.