తుర్కయంజాల్ : కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవించారు. ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధిలోని ఉమర్ఖాన్దాయర, కొహెడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే కాంగ్రెస్ (Congress) నాయకులను ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని అన్నారు. రూ.450 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కొహెడ వ్యవసాయ మార్కెట్(Agriculture Market) ను నిర్మిస్తామని ఇప్పటికే డీపీఆర్ సిద్ధం అయిందని తెలిపారు. నియోజకవర్గాన్ని రూ. 2931 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటుగా అనేక పరిశ్రమలు(Industries) ఏర్పాటు చేశామని తెలిపారు.
పరిశ్రమల ద్వారా నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.