వికారాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : మూసీనది జన్మస్థలమైన వికారాబాద్లోనే కలుషితమవుతున్నది. గత ఏడాదిగా మూసీలోకి నేరుగా మురుగునీరు కలుస్తున్నది. రూ. లక్షన్నర కోట్లు పెట్టి మూసీని సుందరీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఒకవైపు గప్పాలు కొడుతున్నారు కానీ.. పాడైపోయిన యంత్రాలకు మరమ్మతులు చేయించేందుకు ఇప్పటికీ రూపాయీ కేటాయించపోవడం దారుణమని పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, స్థానికులు ఈసడించుకుంటున్నారు. శుద్ధి చేయకుండానే మూసీనదిలోకి వికారాబాద్ పట్టణంలోని మురుగునీటిని వదులుతుండడంతో దాని పరీవాహక ప్రాంతంలోని రైతులు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వికారాబాద్ మున్సిపాలిటీలోని ఎస్టీపీ(సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాం ట్) గత 12 నెలలుగా పనిచేయకపోవడంతో మురుగునీటి శుద్ధి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి వచ్చే మురుగు నీరంతా నేరుగా మూసీనదిలో కలుస్తుండడంతో.. దాని పరీవాహక ప్రాం తంలోని రైతులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా జంట జలాశయాల్లోని ఒకటైన ఉస్మాన్సాగర్లోకి కూడా వికారాబాద్ మున్సిపాలిటీ డ్రైనేజీ నీరు కలుస్తుండడం బాధాకరం.
గతం లో కేవలం హైదరాబాద్లోనే మురుగునీటితో కలుషితమయ్యే మూసీనది… కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరితో మూసీ జన్మస్థలం వద్దే మురుగు నీరు కలుస్తుండడంపై స్థానికులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కేంద్రంలో పాడైన సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వికారాబాద్లో పర్యటించిన సందర్భంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేతో కలిసి సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి, మురుగునీటి శుద్ధి ప్ర క్రియ ఎందుకు నిలిచిపోయిందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు మూసీలోకి డ్రైనేజీ నీరు వెళ్తుండడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీపీ(సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏడాదిగా పనిచేయడం లేదు. దాని యంత్రాలను బాగు చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఏడాదిగా ఒక్క రూపాయీ విడుదల చేయకపోవడంతో ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఏడాదిగా సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయకపోవడంతో ప్రస్తుతం ఎస్టీపీకి సంబంధించిన యంత్రాలు తుప్పుపట్టే దశకు చేరుకున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎస్టీపీ పాడైపోయి ఏడాది అవుతున్నా దానిని బాగు చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులు సర్కార్ కు ప్రతిపాదనలు పెట్టినా రూపాయీ విదల్చకపోవ డం సిగ్గుచేటు. రూ.లక్షన్నర కోట్లు పెట్టి మూసీని సుందరీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి గప్పాలు కొడుతున్నారు.
కానీ, మూసీనది పుట్టే వికారాబాద్ ప్రాం తాన్నే పట్టించుకోని ఆయన మూసీ సుందరీకరణ ఏమి చేస్తారు.? ఈ విషయంలో అందరికీ అనుమానాలున్నాయి. వికారాబాద్ పట్టణ మురుగునీరు మొత్తం ఎస్టీపీలో శుద్ధి కాకుండా మూసీనదిలో కలుస్తుండడంతో దాని పరీవాహక ప్రాంతంలో జీవిస్తు న్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు.
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే