ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ రమావత్ మోహన్నాయక్, 16వ వార్డు కౌన్సిలర్ నరాల విశాలసాగర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే ఇబ్రహీంపట్నం మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న నాయకుడు జి ల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కూడా కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పటికే తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మరికొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారని, వారికి పార్టీలో సముచితస్థానం ఇవ్వడంతో పాటు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డు ల్లో అభివృద్ధి పనులు కూడా అవసరమైన నిధులు ఇస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్లు మోహన్నాయక్, నరాల విశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్లను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి బీఆర్ఎస్ కండువాలు కప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్లు బీఆర్ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరారన్నారు. నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృదికి భారీగా నిధులు కేటాయించారని అన్నారు. ఇటీవల మం త్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి రూ.15కోట్లు, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీకి రూ.15కోట్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.10కోట్లు, ఆదిబట్ల మున్సిపాలిటీకి రూ.10కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులతో మరింత అభివృది చేయనున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని తమ వార్దుల్లో అభివృద్ధి పనులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్లో చేరామని కౌన్సిలర్లు మోహన్నాయక్, నరాల విశాలసాగర్ అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని, ఆయన రాజకీయాలకతీతంగా మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తారని అన్నారు. తమ వా ర్డులను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్లో చేరామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్కుమార్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు నీలంశ్వేత, నీళ్ల బానుగౌడ్, సుల్తాన్, మంద సుధాకర్, యాచారం సుజాత రవీందర్, బాలరాజు, బర్తాకి జగన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్, నాయకులు జెర్కోని రాజు, నిట్టు జగదీశ్వర్, రాజ్కుమార్, సాయి, కాజు, రవీందర్, ప్రవీణ్నాయక్, కరుణాకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్పల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్లు సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డుసభ్యులు పెద్దగారి సునిత శ్రీరామ్, ఏదుళ్ల లింగస్వామితో పాటు కాంగ్రెస్పార్టీ నాయకులు జాన బీరప్ప, సతీశ్, టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పగిడిమర్రి జంగయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.