ధారూరు, అక్టోబర్ 1 : గత పాలనలో కన్నీళ్లు.. బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీరు అందుతున్నదని.. గ్రామాల అభివృద్ధ్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన పాలన మనమే చేసుకుందామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని ధారూరు, ధారూరు స్టేషన్, దోర్నాల్, జీడిగడ్డతండా, మున్నూరు సోమారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో మాజీ ఎంపీటీసీ దస్తయ్య, రాములునాయక్, బావుసింగ్, తోట నర్సింహులు, రాములు, శ్రీనివాస్, గోపాల్, ఎల్లయ్య, అనంతయ్య, పాండు, బబ్లూ, వీరు, శ్రీను, లోకేశ్, నవీన్, వినోద్, రమేశ్, కృష్ణ, హుస్సేన్, వారి అనుచరులు 140 మంది ఉన్నారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ధారూరు మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శి రాజుగుప్తా, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, నాయకులు వేణుగోపాల్రెడ్డి, వెంకటయ్య, లక్ష్మయ్య, రాములు, జైపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, బాలూనాయక్, శ్రీనివాస్నాయక్, గోవింద్రాజ్గౌడ్, రవీందర్నాయక్, భీమ్సేన్రావు ఉన్నారు.
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమ పాలన
వికారాబాద్ : బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమవుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారంకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి అనుచరులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషితో గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో దేశంలో నంబర్ వన్గా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇన్ని పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. పార్టీలో చేరినవారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాములు, ఖలీమ్, ఖాజా, సలీమ్ ఉన్నారు.
ప్రతిపక్షాలతో విసిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిక
కొడంగల్ : ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒక్క తాటిపై నడిపిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధి బొంరాస్పేట మండలంలోని కుబ్యానాయక్తండా, తెగలగడ్డతండాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 330 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ. గడిచిన 9 సంవత్సరాల్లో తెలంగాణను దేశంలోనే నం.1 రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీల నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికారాన్ని ఏ విధంగా దక్కించుకోవాలనే ప్రయత్నంలోనే ఉండిపోయే వారని.. తద్వారా అభివృద్ధి అమడ దూరంలో ఉండిపోయినట్లు తెలిపారు. దీర్ఘకాల పోరాటం సాగించి, ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న వినూత్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఏండ్ల కాలంగా రోడ్డు ఎరుగని ఎన్నో గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లను మంజూరు చేసి, పనులు పూర్తి చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. గిరిజనులకు అధికారాన్ని కట్టబెట్టి వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కృషి చేస్తుండటంతో గిరిజనులు బీఆర్ఎస్ పార్టీని గుండెకు హత్తుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజల మధ్య ఉండే నాయకుడి కోసం..
పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ.. ఎక్కడో ఉండి చేతులు ఊపే రేవంత్రెడ్డిలాంటి నాయకుడు ప్రజలకు అవసరం లేదని, ప్రజల మధ్యన ఉండి ప్రజల భుజం తట్టే నాయకుడు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అటువంటి నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అని, నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యలను స్వయంగా గుర్తించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రేవంత్రెడ్డిని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏ ఒక్కనాడూ మా బాధలను పట్టించుకోలేదని, ఏ ఒక్క తండాను కూడా సందర్శించిన దాఖలాలు లేవన్నారు. నరేందర్రెడ్డి పిలిస్తే పలికే నాయకుడని, కష్టాల్లో ఉన్న ప్రజలు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ.. ఎప్పటికప్పుడు కష్ట, సుఖాలను తెలుసుకొని ఇంటి మనిషిలా కాపాడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు ప్రజల మధ్యన ఉండే పార్టీలో ఉంటే ఎంతో గౌరవం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, బొంరాస్పేట పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.