కొండాపూర్, ఫిబ్రవరి 16 : నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
డిసెంబర్ నుంచి జనవరి వరకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రవణ్ యాదవ్, రాజు, భాగ్య, మల్లేశ్వరీ, అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.