వికారాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): జిల్లా కు మణిహారంగా మారనున్నదని భావించిన మొబిలిటీ వ్యాలీకి గ్రహణం పట్టింది. భూసేకరణ పూర్తై ఏడాది కావొస్తున్నా దీనికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాను ప్రగతిపథంలో ముందుంచేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని మోమిన్పేట మండలంలోని ఎన్కతలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అ యితే అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొబిలిటీ వ్యాలీ అంశాన్ని ఇప్పటివరకు ప్రస్తావించకపోవడం గమనార్హం. భూసేకరణ పూర్తై.. భూమిని చదును చేసి అభివృద్ధి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభు త్వం సంకల్పించగా.. అంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. తదనంతరం డిసెంబర్ మొదటి వారంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ భారీ ప్రాజెక్టుపై చర్చించకపోవడంతో నీలినీడలు కమ్ముకున్నాయి. మొబిలిటీ వ్యాలీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన పలు కంపెనీలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ భారీ ప్రాజెక్టు ముందుకు సాగుతుం దో..? లేదోననే..? అయోమయం నెలకొన్నది. ఈ ప్రాజెక్టు.. ఇక్కడే ఉంటుందా.. లేదంటే మరో జిల్లాకు వెళ్తుందా..? అనే అనుమానాలు కూడా జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో టీఎస్-ఐఐసీ, టీఎస్-ఐపాస్ వంటి వాటిని తీసుకొచ్చి నూతన శకానికి నాంది పలకడంతోపాటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది. మరీ కాంగ్రెస్ ప్రభు త్వం పారిశ్రామిక రంగానికి ఏ విధంగా సహకరిస్తుందనే ఆందోళన పారిశ్రామికవేత్తల్లో నెలకొన్నది.
మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టును 940 ఎకరాల్లో.. రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో..4 లక్షల మం దికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోమిన్పేట మండలంలోని ఎన్కతలలో ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ గతేడాది సెప్టెంబర్లోనే పూర్తి కాగా..టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో భూఅభివృద్ధి ప నులను కూడా కొంతమేర చేపట్టారు. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు స్వచ్ఛందం గా భూములిచ్చేందుకు ముందుకొచ్చిన వారికి గత ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా అందజేసింది. ఎన్కతల గ్రామ పంచాయతీ సర్వేనంబర్ -174, 198 పరిధిలోని 636.11 ఎకరాల అసై న్డ్ భూములకు సంబంధించిన 400 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.17 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని జమచేసింది. అదేవిధంగా అసైన్డ్దారుల కుటుంబాల్లోని అర్హులకు మొబిలిటీ వ్యాలీలో ఉద్యోగాలు ఇవ్వ డంతోపాటు వారి పిల్లలకు నాణ్యమైన చదువును అందించేందుకు ప్రత్యేకంగా బాలురు, బాలికల రెసిడెన్షియల్ బడులను ఏర్పాటు చేయాలని కేసీ ఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్త ప్రభుత్వం అసైన్డ్దారులకు ఉద్యోగాలు, తదితర సౌకర్యాలు కల్పించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆందోళన భూములిచ్చిన వారి కుటుంబాల్లో నెలకొన్నది. మరోవైపు మొబిలిటీ వ్యాలీ పూర్తైతే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చాలామంది స్థానికులున్నారు. మొబిలిటీ వ్యాలీ లో ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు విడి భాగాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలియడంతో స్థానికంగా భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరం భూమి ధర రూ.కోట్లలో పడగలెత్తింది. అయితే రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో భూముల ధరలు పడిపోవడంతోపాటు చుట్టుపక్కల పూర్తిగా భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి.