రంగారెడ్డి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఆర్డీఏ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్డీఏ అదనపు పీడీ నీరజ, ఏపీవో నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.