రంగారెడ్డి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ)/వికారాబాద్ : ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిషరించాలని రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లు శశాంక, నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు భూపాల్రెడ్డి, రాహుల్ శర్మ, లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్లతో కలిసి వారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లాలో 149 ఫిర్యాదులు, వికారాబాద్ జిల్లాలో 127 ఫిర్యాదులు అందాయి.
అనంతరం రంగారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులపై చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఒకవేళ వినతులు పరిషారం కానట్లయితే, అందుకు గల కారణాలను స్పష్టంగా పేరొనాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు, మండల ఆధికారులు, మున్సిపల్ అధికారులందరూ రావాలని సూచించారు. రైతులు భూ సర్వేలకు సంబంధించి దరఖాస్తు చేసేటప్పుడు కలెక్టర్కు లేదా అదనపు కలెక్టర్కు దరఖాస్తు సమర్పించాలన్నారు.
వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్ల పనులకు సంబంధించి వెంటనే గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఓపెన్ కరాటే, కుంగ్ ఫూ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన కులకచర్ల మండలానికి చెందిన విద్యార్థులకు కలెక్టర్ మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు.