ఇబ్రహీంపట్నం, జనవరి 8 : ప్రజాపాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా ఎంట్రీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మేనేజర్ వేణుగోపాల్రెడ్డి ఉన్నారు