వికారాబాద్, మార్చి 26 : ప్రతి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో బోర్ వెల్స్, హ్యాండ్ పంప్లు వర్కింగ్ కండీషన్లో ఉండేలా చూడాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మిషన్ భగీరథ అధికారులు, ఏఈలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శులకు గైడ్ చేయాలని, మంజూరైన పనులను పూర్తి చేయాలన్నారు. తాగునీటికి సంబంధించిన పనులన్నింటినీ ఏప్రిల్ 5వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. బోర్లు, చేతి పంపులు రిపేరు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో డీపీవో జయసుధ, మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.