వికారాబాద్, ఫిబ్రవరి 4 : జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఈవీఎం గోడౌన్కు వేసిన సీల్ను పరిశీలించి, సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు.
ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. కలెక్టర్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ, సంబంధిత అధికారులు ఉన్నారు.