కడ్తాల్ : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన నరేందర్కి రూ. 20వేలు ఎమ్మెల్సీ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. శనివారం ఉదయం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్సీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు సురేందర్రెడ్డి, శంకర్, యాదవ్, రమేశ్ పాల్గొన్నారు.