కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన వరలక్ష్మీకి రూ. 26వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైంది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకందరికీ కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిదన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, బీష్మాచారి, లక్ష్మయ్యగౌడ్ పాల్గొన్నారు.