దౌల్తాబాద్ : పేద ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు దవాఖానలో చేరాడు. చికిత్స కోసం డబ్బులు లేక పోవడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి కింద రూ. 38,000లను మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసీ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా ఉంటూ కార్పొరేట్ వైద్యం కోసం చెక్కులను మంజూరు చేసి వారికి భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.