పీడీఎల్ : సీయం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దేమూల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ, జనగాం గ్రామానికి చెందిన శివలక్ష్మి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 16000, రూ. 38000 వేలు మంజూరు అయ్యాయి. దీనికి సంబంధించిన ఎల్వోసీని శనివారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనేకమంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్లో కూడా నియోజకవర్గంలోని ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న నిరుపేదలకు అండగా ఉంటానన్నారు. అంతేకాకుండా వారికి కార్పొరేటు వైద్యం అందించడం జరుగుతుందన్నారు.