నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకువెళ్తుందని అందుకు సరిపడ నిధులను కూడా మంజూరు చేస్తుందని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆరోగ్య ప్రయోజనాలను ఎప్పటికప్పుడు నిధులను మంజూరు చేస్తు ప్రజల మనస్సుల్లో స్థిరంగా ఉండిపోయ్యారు మన సీఎం కేసీఆర్.
నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24మందికి రూ. 12లక్షల 50వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, యెల్లకొండ సర్పంచ్ రావుగారి వెంకట్రెడ్డి, పులుమామిడి సర్పంచ్ విమల రంగారెడ్డి, కిష్టారెడ్డి, బుచ్చిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.