ఆమనగల్లు : మాడ్గుల మండలంలో ని ఫిరోజ్నగర్కు చెందిన మల్లేష్కు గురువారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా మంజురైన రూ. 3లక్షల ఎల్ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా ప్రభుత్వ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని కోరారు. అనంతరం ఆమనగల్లు, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన పలు వివాహా వేడుకల్లో పాల్గొన్ని వధువరులను ఆశీర్వదించారు.