ఆమనగల్లు : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ పథకానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. కలకొండ గ్రామానికి చెందిన మరెడ్డికి రూ. 60వేలు, ఇర్విన్ గ్రామానికి చెందిన కృష్ణయ్యకు రూ. 19వేలు, మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పోశమ్మకు రూ. 26వేలు మంజురయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలంతా సీఎం రిలీఫ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.