కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ యమునకి రూ. 17వేలు, జ్యోతికి రూ. 16వేలు, కల్వకుర్తి మండలం సుద్దకల్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మకి రూ. 70వేలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందని, ఈ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, లక్ష్మయ్యగౌడ్, భీష్మాచారి, బాబా, సత్యం, లక్ష్మయ్య పాల్గొన్నారు.