తాండూరు : తాండూరు పట్టణంలోని శారదబాయి అనే మహిళ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు. దవాఖానలో ఆమె వైద్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో సహాయ నిమిత్తం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో ఎల్వోసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సహాయనిధి నుంచి ఎల్వోసి రూ. 5లక్షలు మంజురు అయింది. మంజురైన చెక్కును ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు.