కడ్తాల్ : నూతనంగా మండలంగా ఏర్పడిన కడ్తాల్ పట్టణంలో 30పడకల ప్రభుత్వ దవాఖానకు ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్కి రూ. 1,25,000లు, రమేశ్కి రూ. లక్ష, కల్పనరెడ్డికి రూ. 29,500, చరికొండ గ్రామానికి చెందిన సుజాతకి రూ. 60వేలు, సాలార్పూర్ గ్రామానికి చెందిన ఫకీరాకి రూ.32 వేలు, రేకులాకుంట తండాకి చెందిన రమీజీకి రూ.16 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలోను ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందన్నారు. వైద్యరంగానికి టీఆర్ఎస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, జానాభా ప్రాతిపదికన పట్టణాల్లో బస్తీ దవాఖానల్లో, గ్రామాల్లో పల్లె దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. హైదదబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రానా సెంటర్ను త్వరలో ఏర్పాటు చేసి 24 గంటల వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే 75శాతం పూర్తయ్యిందని, కరోనా స్వల్ప లక్షణాలున్న వారికి ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తుందన్నారు. అర్హులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుందని వివరించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతుబంధు సమితి మండల, గ్రామాలాధ్యక్షులు వీరయ్య, నర్సింహ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు గంప శ్రీను, సర్పంచ్ కృష్ణయ్యయాదవ్, నాయకులు రాంచంద్రారెడ్డి, బీచ్చానాయక్, భీక్యానాయక్, అంజి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.