మాడ్గుల/ఆమనగల్లు : సీఎం రిలిఫ్ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం మాడ్గుల మండలంలోని పలువురు బాధితులకు సీఎం రిలిఫ్ఫండ్ చెక్కులను ఆయన నివాసంలో అందజేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన నిర్మలా మేరికి రూ. 60వేలు, బాల్రెడ్డికి రూ. 28వేలు, యాదగిరికి రూ. 50వేల చెక్కులు మంజురయ్యాయి.